తమిళనాడులో ఐటీ రైడ్స్ కలకలం..

తమిళనాడులో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ జీ స్క్వేర్‌‌కు చెందిన వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు నగరాల్లో సంస్థ ఆస్తులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా ఐటీ సోదాలను వ్యతిరేకిస్తూ డీఎంకే శ్రేణులు ఆందోళనకు దిగాయి.

జీ స్క్వేర్‌‌లో డీఎంకే ఎమ్మెల్యే ఎంకే మోహన్ కుమారుడు షేర్ హోల్డర్‌గా ఉన్నారు. అయితే అన్నా నగర్‌లో ఎమ్మెల్యే మోహన్ కుమారుడి ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయడంపై డీఎంకే శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణలోనూ సోదాలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత భాస్కర్ ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు.