ఐపీఎల్ 2020 షెడ్యూల్ ఇదే
19 వ తేదీ నుంచి మొదటి మ్యాచ్-ముంబై ఇండియన్స్… చెన్నై సూపర్ కింగ్స్ మధ్య

ఐపీఎల్ 2020 మ్యాచ్ లకు సంబందించిన పూర్తి షెడ్యూల్ ను కొద్దిసేపటి క్రితమే నిర్వాహకులు విడుదల చేశారు.
ఈనెల 19 వ తేదీ నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి.
మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్… చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోతున్నది. ఇక సెప్టెంబర్ 21 వ తేదీన హైదరాబాద్ సన్ రైజర్స్… బెంగళూరు జట్ల మధ్య జరగబోతున్నది.
సెప్టెంబర్ 20 వ తేదీన ఢిల్లీ పంజాబ్ లెవెన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతున్నది. ఈ ఏడాది మార్చి 29 వ తేదీ నుంచే మ్యాచ్ లు జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.
అయితే, అక్టోబర్ లో జరగాల్సిన టి 20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో ఆ సమయాన్ని ఐపీఎల్ మ్యాచ్ లకోసం కేటాయించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/