చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జగన్ ప్రభుత్వ బాధితులకు ఆహ్వానం

chandrababu

ఈ నెల 12 న చంద్రబాబు ఏపీ రాష్ట్ర సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. విజయవాడ నుంచి గన్నవరం మధ్యలోని కేసరపల్లిలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వేదికగా నిర్ణయనించారు. ఇప్పటికే ఈ కార్యక్రమ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో, ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు. అలాగే ప్రధాని మోడీ తో పాటు NDA కూటమి నేతలు సైతం తరలిరాబోతున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగన్ ప్రభుత్వ బాధితులను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితుల కోసం ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేసింది. మొత్తం 112 కుటుంబాలు ఇందుకు ఎంపిక చేశారు. అబ్దుల్ సలాం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం సహా మొత్తం 112 కుంటుబాలకు ఆహ్వనం పంపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికార పార్టీ అరాచకాలకు బలైన కుటుంబాలను సైతం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రస్తుతం బాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. నిన్న ఢిల్లీ లో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవడం జరిగింది.