అమెరికాలో కరోనా మరణ మృదంగం
మరో 2207 మంది మృతి
అమెరికా: అమెరికాలో కరోనా మరణ మృదంగం సృష్టిస్తుంది. ఒక్కరోజు వ్యవధి లోనే అమెరికాలో కరోనా కారణంగా 2207 మంది మరణించారు. దీనితో అమెరికాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 58,351 కి చేరింది. అమెరికాలో కరోనా కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. అగ్రరాజ్యంలో కరోనా బాధితుల సంఖ్య పది లక్షలు దాటింది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా సోకినా వారి సంఖ్య 10,34,588 కి చేరిందని జాన్ హఫ్కిన్స్ విశ్వ విద్యాలయం పేర్కొంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి. https://www.vaartha.com/telangana/