‘విజన్ ఇచ్చే ఫలితాలకు నేటి హైదరాబాద్ సాక్ష్యం’

అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరడం నాకు అత్యంత సంతృప్తినిచ్చే అంశం : చంద్రబాబు

IIIT హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా క్యాంపస్ లో నిర్వహించిన ఇంట్రాక్షన్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐటీ ఇండస్ట్రీ ప్రమోషన్, నాలెడ్జ్ ఎకానమీ విషయంలో తన ఆలోచనలు, పాలసీలపై అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1998లో ఐఐఐటీ ఏర్పాటుకు దారితీసిన అంశాలను వివరించారు.

Chandrababu Naidu at IIIT Silver Jubilee celebrations in Hyderabad

Hyderabad: విజన్ తో తీసుకున్న నిర్ణయాలు, పాలసీల తో వచ్చిన ఫలితాలు నేడు కళ్లముందు కనిపిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజన్ ఇచ్చే ఫలితాలకు నేటి హైదరాబాద్ సాక్ష్యం అని ఆయన చెప్పారు. నేడు తెలంగాణ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా ఆవిర్భవించడానికి నాడు ఇక్కడ జరిగిన అభివృద్దే కారణం అని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో గెలవడం వేరు.. అభివృద్ది చేయడం వేరు అని ఆయన అభిప్రాయ పడ్డారు. నాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ను ఎంతో అభివృద్ది చేశామని…అయితే 2004 ఎన్నికల్లో తాము ఓడిపోయామని చంద్రబాబు అన్నారు. అందుకే అభివృద్దిని, ఎన్నికల ఫలితాలను పోల్చి చూడనని చంద్రబాబు అన్నారు. ప్రజలకు అభివృద్ది ఫలాలు చేరడం నాకు అత్యంత సంతృప్తినిస్తుందని అన్నారు. దేశంలో స్మార్ట్ సిటీలతో పాటు…స్మార్ట్ విలేజ్ లు కూడా రావాలి అనేది తన అభిమతం అని చంద్రబాబు నాయుడు అన్నారు.

అభివృద్ది చేయడం వేరు…ఎన్నికల్లో గెలవడం వేరు! స్మార్ట్ సిటీలతో పాటు.. స్మార్ట్ విలేజ్ లు కూడా రావాలి. దేశ రాజధానిని కూడా హైదరాబాద్ తీసుకువెళ్లేలా ఉన్నావ్ అని నాడు వాజ్ పేయి అన్నారు: హైదరాబాద్ ట్రిపుల్ ఐటి సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో చంద్రబాబు నాయుడు

నాడు రాష్ట్రం కోసం అనేక అంశాల్లో ప్రధాని వాజ్ పేయిపై ఒత్తిడి తెచ్చేవాడిని అని… నిన్ను చూస్తుంటే దేశ రాజధానిని కూడా హైదరాబాద్ తీసుకువెళ్లేలా ఉన్నావ్ అని నాడు వాజ్ పేయి అన్నారని గతాన్ని గుర్తు చేసుకున్నారు. IIIT హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా క్యాంపస్ లో నిర్వహించిన ఇంట్రాక్షన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…ఐటీ అనేది నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ అవుతుందని నాడు గుర్తించాను. దీనిలో భాగంగానే ఐటీ సంస్థలను ప్రోత్సహించాము. ఐటీ సంస్థల్లో పని చేయడానికి ఐఐఐటీ వంటి సంస్థలను హైదరాబాద్ లో ఏర్పాటు చేశాను. రాష్ట్రం లో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీను అందుబాటులోకి తెచ్చాను. దీంతో నిపుణుల లభ్యత పెరిగింది. ISB, IIIT, నల్సార్ వంటి సంస్థల తీసుకువచ్చాం. రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు, రెగ్యులర్ ఇంజనీరింగ్ కాకుండా…సంస్థలకు కావాల్సిన నిపుణులను తయారు చేయడానికి ఈ సంస్థలను తీసుకువచ్చాం. ట్రిపుల్ ఐటీ ఆవిర్భావం సందర్భంగా సీఎం హోదాలో నన్ను చైర్మన్ గా ఉండమన్నారు. కానీ ఆ రంగ నిపుణులు దానికి హెడ్ గా ఉండడమే కరెక్ట్ అని చెప్పాను. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదు.. ఇటువంటి సంస్థలకు మేం అధిపతులుగా ఉండకూడదు అని చెప్పాను అని చంద్రబాబు నాయుడు నాటి అనుభవాలను పంచుకున్నారు.

Chandrababu Naidu at IIIT Silver Jubilee celebrations in Hyderabad

నాడు నేను స్థాపించిన ఈ ట్రిపుల్ ఐటి టాప్ 10 సంస్థల్లో స్థానం పొందడం పై నేను ఎంతో గర్వంగా ఉన్నాను. ముందు మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాద్ తీసుకువచ్చాము. మైక్రోసాఫ్ట్ వస్తే అన్ని సంస్థలు వస్తాయని గ్రహించాను. దాని కోసమే బిల్ గేట్స్ ను ప్రజెంటేషన్ ద్వారా మెప్పించి మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చాను. మైక్రోసాఫ్ట్ డవలప్మెంట్ సెంటర్ ను పెట్టాలని గట్టిగా కోరాను. భారతీయులకు ఐటీలో ఉన్న నైపుణ్యం వివరించాను. మూడు నాలుగు మీటింగ్ ల తరవాత బిల్ గేట్స్ హైదరాబాద్ లో మైక్రో సాఫ్ట్ సెంటర్ పెట్టారు. దీంతో హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు వరసకట్టాయి అని చంద్రబాబు నాయుడు చెప్పారు. నేను హైదరాబాద్ లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాను. కానీ 2004 ఎన్నికల్లో మేం ఎన్నికల్లో ఓడిపోయాం. ఎన్నికల్లో గెలవడం వేరు.. అభివృద్ది, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం వేరు అని చంద్రబాబు అన్నారు.

ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, సంస్థల ఏర్పాటు అనేది అంత ఈజీగా జగరలేదు. అవి ఎలా వచ్చాయో, ఎవరు తెచ్చారు అనేది ఇప్పుడు ఎవరికి తెలియకపోవచ్చు.. కానీ ప్రజలకు ఉపయోగపడుతున్న విధానం నాకు సంతృప్తి నిస్తుంది. అది నా మనసుకు ఆనందాన్ని ఇస్తుంది అన్నారు. నాడు కేంద్రం పై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి సంస్థలు తెచ్చాను. మీరు నాకు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు.. పాలసీలు తీసుకురండి అని మాత్రమే నాడు కేంద్రాన్ని కోరాను. ఆ పాలసీల ద్వారా ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టువంటి సంస్థలను తీసుకువచ్చాను. అనేక సవాళ్లను ఎదుర్కొని నాడు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తెచ్చాను. పిపిపి విధానంలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశాను అని చెప్పారు. నాడు జీనోం వ్యాలీ నా హయాంలోనే ఏర్పాటు అయ్యింది. ఇప్పుడు కరోనాకు దాని నుంచే వ్యాక్సిన్ వచ్చింది. ISBని హైదరాబాద్ కు తీసుకురావడానికి చాలా శ్రమించాను. అత్యుత్తమ ప్రభుత్వ పాలసీల వల్లనే నాడు ISB హైదరాబాద్ వచ్చింది. ఫార్మా ఎక్స్ పోర్ట్ కౌన్సిల్ కూడా గట్టి ప్రయత్నం ద్వారా హైదరాబాద్ వచ్చింది. విజన్ తో అద్భుత ఫలితాలు సాధించవచ్చు. అందుకే విజన్ 2047 ను ప్రతిపాదించాను. విజన్ 2020 ద్వారా 20 ఏళ్లలో సాధించిన ఫలితాలు మన కళ్లముందు ఉన్నాయి. భారత దేశానికి ఉన్న యవశక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఇతర దేశాలకంటే మనకు ఉన్న ఉన్న సౌలభ్యం, బలం శక్తి వంతమైన యువత ఉండడం. దీన్ని ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ” అని అన్నారు.

Students participating in Hyderabad IIIT Silver Jubilee celebrations

2002లో జరిగిన జాతీయ క్రీడలకు ప్రత్యేక క్రీడా గ్రామాలు నిర్మించాము. తరువాత ఆఫ్రో ఏషియన్ గేమ్స్ వచ్చాయి. ఇక్కడ చేసిన మౌళిక సదుపాయాల వల్ల సమర్థవంతంగా క్రీడలు నిర్వహించాం. ఒలంపిక్ క్రీడలు కూడా నిర్వహించే సమర్థత దేశానికి ఉందని నేను నమ్ముతాను. అదే విషయం నాడు చెప్పాను అని చంద్రబాబు అన్నారు.

అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/category/news/international-news/