హైదరాబాద్ పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి
హైదరాబాద్ పేలుళ్ల కేసులో ఎట్టకేలకు తీర్పు వెల్లడించింది ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు. ఈ కేసులో కీలక సూత్రధారి ఒబెద్ ఉర్ రెహమాన్ తో పాటూ 10మందికి జైలు శిక్ష ఖరారు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. హైదరాబాద్ లో పేలుళ్ల కు ఒబెద్ ముఖ్య సూత్రధారి. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్ధాలు తీసుకొచ్చి మరీ పేలుళ్ల కు కుట్ర పన్నారు. అయితే తెలంగాణ పోలీసులు ఆ కుట్రను ముందుగానే భగ్నం చేశారు.
ఒబెద్ పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కోర్టు విచారణలో తేలింది. ఇక ‘ముజాహిద్దీన్ కుట్ర’గా ప్రాచుర్యం పొందిన ఈ కేసులో సయ్యద్ ముక్బుల్ను సెప్టెంబర్ 22వ తేదీన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఐదవ నిందితుడిగా ఉన్నాడు ముక్బుల్. నాందేడ్కు చెందిన ముక్బుల్ను ఉగ్ర కదలికల నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన అరెస్ట్ చేశారు. పాక్ ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్లోని కీలక సభ్యులతో ముక్బుల్ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.