మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు

మంత్రి కాకాణి కోర్టులోనే ఫైల్స్‌ దొంగతనం చేశారు..లోకేశ్‌

nara-lokesh-yuvagalam-padayatra-in-nellore-district

నెల్లూరు: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ…వరదల సమయంలో డ్యామ్, గోడలు దెబ్బతిన్నా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టులోనే ఫైల్స్ దొంగతనం చేశారని లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సోమశిల జలాశయం సమస్యను పరిష్కరించి, వలసలు లేకుండా చేస్తామన్నారు. ఇరిగేషన్ మంత్రిగా అనిల్ కుమార్ సాధించింది ఏమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని ధ్వజమెత్తారు.