హైదరాబాద్ లో అత్తారింటి వేధింపులు తాళలేక అల్లుడు ఆత్మహత్య..

మాములుగా అత్తారింటి వేధింపులు తాళలేక కోడలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు తరుచు జరగడం , వార్తల్లో నిలువడం జరుగుతుంది. కానీ తాజాగా హైదరాబాద్ అత్తారింటి వేధింపులు తాళలేక అల్లుడు ఆత్మహత్య చేసుకోవడం తో వార్తల్లో హైలైట్ గా నిలుస్తుంది.

వివరాల్లోకి వెళ్తే..

కుషాయిగూడలోని పోచమ్మగుడి వద్ద మొలుగు వెంకట్‌రెడ్డి (38) తల్లి, భార్య కల్యాణి, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ప్రైవేటు జాబ్ చేసుకునే వెంకట్‌రెడ్డితో కలిసి అతని తల్లి ఉండటం అతని భార్య, అత్తమామలకు ఇష్టం లేదు. దీంతో వేరే కాపురం పెడదామని వారు నిత్యం వేధించసాగారు. దీంతో దంపతులమధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్య అలిగి పిల్లలను తీసుకుని రెండునెలల క్రితం వరంగల్‌లో పుట్టింటికి వెళ్లింది.

ఈ క్రమంలో జులై 2న తల్లిదండ్రులను తీసుకుని కల్యాణి భర్త ఇంటికి వచ్చి నానా హంగామా చేసింది. అత్తను వెంటనే ఇంటి నుంచి పంపించేయాలని పట్టుబట్టింది. పైగా ఆస్తి అంతటిని పిల్లల పేరున రాయాలని ఒత్తిడి చేసింది. పరువు పోతుందని ఎంతచెప్పినా కల్యాణి వినలేదు. చేస్తానన్న భయపడలేదు.. డ్రామాలాడకు నువ్వు చచ్చేవాడివేనా అంటూ హేళన చేసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వెంకట్‌రెడ్డి అదేరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తల్లి గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.