కుప్పంలో అర్థరాత్రి ఓ ఇంట్లో భారీ పేలుడు..

ఆదివారం అర్ధరాత్రి కుప్పంలో భారీ పేలుడు కలకలం రేపింది. కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న మురుగేష్, ధనలక్ష్మీ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు కుప్పం పోలీసులకు సమాచారం అందించి, బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పేలుడు సమాచారం తెలియడంతో ఘటనా స్థలికి చేరుకన్న పోలీసులు పేలుళ్లపై దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కారణం నాటుబాంబులా, జిలెటిన్ స్టిక్సా అనేది తేలాల్సి ఉందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిముందు నాటుబాంబులు పేల్చినట్లు సమాచారం. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యింది. వీరిని టార్గెట్ చేసే పేలుళ్లకు పాల్పడ్డారా? లేక ఇంకేదైనా కారణముందా? తేలాల్సి ఉంది.