కేసులు పెరుగుతున్నాయి కరోనా టెస్టులు పెంచాలి : హైకోర్టు

కరోనా కేసులపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : తెలంగాలో కరోనా కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ మేరకు కొవిడ్ కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే విధంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అనంతరం విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/