సంక్రాంతికి సినిమాలు లేవనే కొరతను ‘హీరో’ తీరుస్తుంది
‘హీరో’ మూవీ మీడియా సమావేశంలో జి .ఆదిశేషగిరి రావు
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ‘ఈ రోజు మనం అశోక్ గురించి మాట్లాడాలి. అతని గురించి ఎవ్వరికీ తెలియదు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి గల్లా జయదేవ్ పార్లమెంట్ సభ్యుడిగా పదేళ్ల నుంచి వేసిన ముద్ర అందరికీ తెలిసిందే. ఆయన నానమ్మ గల్లా అరుణ గారు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఆమె తండ్రి రాజగోపాల్ నాయుడు గారు యాభై ఏళ్ల క్రితమే పార్లమెంట్ సభ్యుడు. ఇండస్ట్రీయల్గా అభివృద్ది చేద్దామని అమెరికా నుంచి ఇక్కడకు వచ్చారు. అనంతపూర్ జిల్లాలో ఎన్నో పరిశ్రమలు పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనళ్లుడిగా ఇవాళ సినీ పరిశ్రమకు వచ్చారు. కృష్ణ గారి పచ్చని సంసారంలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు. అప్పటి నుంచే నటించాలనే కోరిక పుట్టినట్టుంది. అందరూ సహకరించి.. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ను పెట్టారు. సినిమాలో చిన్న చిన్న గ్లింప్స్ చూశాను. స్టార్స్కు ఉండాల్సిన లక్షణాలున్నాయి. డ్యాన్స్, యాక్షన్, కామెడీ, ఎమోషన్స్, సెన్సాఫ్ హ్యూమర్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నీ ఉన్నాయి. మాస్ హీరోకు ఉండే లక్షణాలన్నీ కూడా పునికిపుచ్చుకున్నాడు. ఆదిత్య అద్భుతంగా తెరకెక్కించాడు. అందరూ కలిసి ఈ సినిమాను జనవరి 15న తీసుకురావాలని నిర్ణయించుకున్నాంఇలాంటి సినిమాలను థియేటర్లోనే చూడాలి. సినిమాలో కంటెంట్ ఉంటే సంక్రాంతికి రెండు మూడు చిత్రాలు వచ్చినా కూడా నిలబడతాయి. అందుకే ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నాం. సంక్రాంతికి సినిమాలు లేవనే కొరతను తీర్చేందుకు ఈ సినిమా రాబోతోంది’ అని అన్నారు.
గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను మొదలుపెట్టి రెండేళ్లు అవుతోంది. సగం పూర్తి అయ్యేసరికి ఆల్పా, గామా, భీటా, డెల్టా, ఒమిక్రాన్ ఇలా అన్నింటిని చూశాం. గ్యాప్ దొరికినప్పుడల్లా షూటింగ్ చేస్తూ వచ్చాం. ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో ఎవ్వరూ ఊహించలేరు. ఏది ఏమైనా మనం ముందుకు వెళ్లాల్సిందే. సినిమా ముందుకు జరగాల్సిందే. ఎన్ని సినిమాలు వాయిదా వేసుకున్నారో చూశాం. మా రెండేళ్ల నిరీక్షణకు ఇప్పుడు సరైన సమయం వచ్చింది. మా సినిమాకు ఈ సంక్రాంతి దొరికింది. కృష్ణ గారు జనవరి 15న విడుదల చేయమని చెప్పేశారు. జనవరి 15న అశోక్ని, మా బ్యానర్ను పరిచయం చేయబోతోన్నాం. మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను.’’ అని అన్నారు.
పద్మావతి గల్లా మాట్లాడుతూ.. ‘డిస్ట్రిబ్యూటర్లంతా కూడా సాయం చేస్తున్నారని మా బాబాయ్ ఆదిశేషగిరి రావు చెప్పారు. అందుకే సినిమా ఇంత తక్కువ టైం ఉన్నా కూడా విడుదల చేస్తున్నాం. పండుగకు సినిమాలు చూసే ఆనవాయితీ ఉందని, నాగార్జున గారు కూడా వస్తున్నామని ప్రకటించారు. అందుకే మేం కూడా ధైర్యం చేసి సినిమాను జనవరి 15న తీసుకురాబోతోన్నాం’ అన్నారు.
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ‘అశోక్కి ఇది మొదటి సినిమానే అయినా అద్భుతంగా నటించాడు. చాలా బాగా డ్యాన్స్ చేశారు. మొదటి సినిమాలా ఎక్కడా అనిపించదు. ప్రతీ ఒక్క ఎమోషన్ను అద్బుతంగా పోషించారు. శ్రీరామ్ ఆదిత్య గారు ఎంతో పర్ఫెక్షన్తో తీశారు. సినిమా చూస్తే మీకే అర్థమవుతోంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని అన్నారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య , అశోక్ గల్లా తదితరులు మాట్లాడారు.
ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/