కరోనా బారినపడిన క్రాక్ బ్యూటీ..హాస్పటల్ లో చికిత్స

కరోనా ఉదృతి మరోసారి చిత్రసీమలో అలజడి సృష్టిస్తుంది. కరోనా మొదటి , సెకండ్ వేవ్ లో చాలామంది కరోనా బారినపడగా..కొంతమంది క్షేమంగా బయటపడగా..మరికొంతమంది కరోనా నుండి బయటపడలేక మృతి చెందారు. ఇక ఇప్పుడు మరోసారి కరోనా ఎఫెక్ట్ చిత్రసీమ ఫై పడింది. వరుసపెట్టి అగ్ర హీరోలు, నటీమణులు , డైరెక్టర్స్ ఇలా చాలామంది కరోనా బారినపడుతున్నారు. గురువారం మంచు లక్ష్మి , మహేష్ బాబు లాంటి వారు కరోనా బారిన పడినట్లు స్వయంగా తెలుపుగా…తాజాగా క్రాక్ ఫేమ్ వరలక్ష్మి శరత్ కుమార్ సైతం కరోనా బారినపడినట్లు సమాచారం.

గత రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన వరలక్ష్మి శరత్‌ కుమార్‌..గురువారం రాత్రి కరోనా పరీక్షలు చేయించుకున్నారు అయితే.. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయింది. అయితే.. ఆమె ఊపిరి తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారడంతో… హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ను చేర్పించారు ఆమె కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్త ఆందోలన కరంగా ఉందని తెలుస్తుంది. గత ఏడాది మాస్ మహారాజ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన.. క్రాక్‌ సినిమా లో జయమ్మ అనే గెటప్‌ లో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కనిపించి ఆకట్టుకుంది. ఆ సినిమాతో టాలీవుడ్‌ లో వరుస సినిమాల్లో చాన్స్‌ కొట్టేస్తుంది. తాజాగా బాలయ్య – గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కబోయే మూవీ లోని ఓ కీలక రోల్ లో కనిపించే ఛాన్స్ దక్కించుకుంది.