ఈ 16 నుంచి తెలంగాణలో ఒక్కపూట బడులు

TS Government Schools
TS Government Schools

హైదరాబాద్‌: వేసవి కాలం మొదలైన కారణంగా తెలంగాణలో పాఠశాలలను మధ్యాహ్నం వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కపూట బడులు నిర్వహిస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాకమిషనర్ చిత్రా రామచంద్రన్ వెల్లడించారు. ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ఉంటాయని, జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని వివరించారు. ఈ మేరకు ప్రకటన చేశారు. ఒంటిపూట బడుల సందర్భంగా పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని, మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇళ్లకు పంపుతారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/