మంత్రి కేటీఆర్ ఫై కీలక వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్..మంత్రి కేటీఆర్ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర లో బిజీ గా ఉన్నారు. ఇప్పటికే నాల్గు విడతల్లో యాత్ర చేపట్టి సక్సెస్ కాగా ..రీసెంట్ గా ఐదో విడుత యాత్ర చేపట్టారు. ఈ నెల 16 తో ఐదో విడత యాత్ర ముగుస్తుంది. ఇక ఈ యాత్ర లో టిఆర్ఎస్ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతూ..రాబోయేది బిజెపి ప్రభుత్వమే అని అని ప్రజలు తెలుపుతున్నారు. బిజెపి అధికారంలోకి వస్తే ఏ ఏ పనులు చేస్తుందో ప్రజలకు వివరిస్తున్నారు.

నిర్మల్ జిల్లా దిమ్మదుర్తిలో నిర్వహించిన అంబేద్కర్ వర్థంతి సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ డ్రగ్స్కు బానిస అని , బ్లడ్ శాంపిల్స్​ ఇస్తే నిరూపిస్తానని, నమూనాలు ఇచ్చే దమ్ము కేటీఆర్ కు ఉందా..? అంటూ సవాల్ విసిరారు. అలాగే జీ20 సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లకపోవడం సిగ్గుచేటన్నారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను కాపాడేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అవినీతిలో తండ్రికి తగ్గ కూతురుగా కవిత గుర్తింపు పొందారంటూ వ్యాఖ్యానించారు.