ముంబయి దాడులు..హఫీజ్ సయీద్ కు 10 ఏళ్ల జైలు శిక్ష
నిధుల కేసులో కోర్టు తీర్పు
పాకిస్థాన్: ముంబయి దాడుల సూత్రధారి, పాకిస్థాన్ ఉగ్రవాది హఫీజ్ద్కు పదేళ్ల జైలు శిక్ష పడింది. రెండు ఉగ్రవాద కేసుల్లో అతనికి ఈ శిక్షను పాకిస్థాన్ కోర్టు ఇవాళ ఖరారు చేసింది. జైలు శిక్షతో పాటు 1.10,000 రూపాయల (పాకిస్థానీ రూపీ) జరిమానా విధించింది. ఈ కేసులో హఫీజ్ సయీద్ సన్నిహితుడు అబ్దుల్ రహమాన్ మక్కీకి కోర్టు ఆర్నెల్ల కారాగార శిక్ష విధించింది. కిందటి వారం జరిపిన విచారణలో జమాత్ ఉద్ దవాకు చెందిన మాలిక్ జాఫర్, యాహ్యా ముజాహిద్ లకు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో నిధులకు సంబంధించిన ఆరోపణలపై కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ (సీటీడీ) జమాత్ ఉద్ దవా నాయకులపై కేసులు నమోదు చేసింది. వీరిపై అభియోగాలు నిరూపితం కావడంతో కోర్టు శిక్షలు ప్రకటించింది. నిషిద్ధ సంస్థకు చెందని ఆస్తుల నిర్వహణ, నిధుల సేకరణ ద్వారా ఉగ్రవాదానికి ఆర్థిక ఊతమిచ్చారంటూ వీరిపై సీటీడీ చార్జిషీటు దాఖలు చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/