కరోనా సాకుతో ఉగ్రవాదులను విడుదల చేసిన పాక్‌

విడుదలైన ఉగ్రవాదుల్లో హఫీజ్ సయీద్

hafiz-saeed-released

ఇస్లామాబాద్‌: లష్కరే తాయిబా చీఫ్‌, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను పాక్‌ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. యావత్ ప్రపంచం కరోనాతో తల్లడిల్లిపోతుంటే, పాకిస్థాన్ ఈ మహమ్మారి పేరు చెప్పి కరడుగట్టిన ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేసింది. జైల్లో ఉన్న ఖైదీల మధ్య కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న సాకుతో అనేక మంది ఉగ్రవాదులకు స్వేచ్ఛ ప్రసాదించింది. కాగా లాహోర్ లోని ఓ జైల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు ఉండగా, వారిలో కొందరికి కరోనా సోకిందని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్‌ కోర్టు అతడికి 11ఏళ్ల జైలు శిక్షను విధించింది. అమెరికా ఒత్తిడితో భద్రతా మండలి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ తర్వాత ముంబై పేలుళ్ల కేసు, భారత్‌లో విధ్వంసాలకు కుట్రలు తదితర కేసులకు సంబంధించి సయీద్‌ను తమకు అప్పగించాలని భారత్‌ కోరుతూ వస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/