చైనాలో కొత్తగా 127 పాజిటివ్ కేసులు నమోదు
మొత్తం కేసుల సంఖ్య 84,292
బీజింగ్: చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అక్కడ గడిచిన 24 గంటల్లో 127 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు రోజుల నుంచి 120కి పైగా కేసులు నమోదవుతున్నాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్హెచ్సీ) శుక్రవారం తెలియజేసింది. ఇందులో 123 కేసులు దేశానికి చెందినవిగా గుర్తించారు. 24 గంటల్లో ఒక్క జిన్జియాంగ్లోనే 112 కేసులు నమోదు కాగా, లియోనింగ్ ప్రావిన్స్ 11 కేసులు నమోదయ్యాయి. అయితే వ్యాధితో మరణించిన వారి వివరాలను ఎన్హెచ్సీ తెలుపలేదు. గురువారం నాటికి చైనాలో మొత్తం కేసుల సంఖ్య 84,292కు చేరింది. 684 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. 41 మందికి వ్యాధి తీవ్ర స్థాయిలో ఉంది. 78,974 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 4,634 మంది ఈ వ్యాధితో మరణించారని కమిషన్ తెలిపింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/