ఒంగోలులో అమానవీయ ఘటన : గిరిజన యువకుడి నోట్లో మూత్రం పోసిన దుండగులు

ఏపీలో గిరిజనులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు ఎక్కడో చోట గిరిజన వ్యక్తుల ఫై దాడి అనేది వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గిరిజన యువకుడ్ని దారుణంగా కొట్టి .. నోట్లో మూత్రం పోసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెల రోజుల కిందట జరిగిన ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. కేవలం దాడి, ఎస్సీ,ఎస్టీ కేసుగా నమోదుచేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. అయితే ఇప్పుడు ఆనాటి దృశ్యాలను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో అవికాస్తా వైరల్ అయ్యాయి. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ అయ్యారు. దీంతో నిందితుల కోసం ఒంగోలు పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.

వివరాల్లోకి వెళ్తే..

ఒంగోలు ప్రాంతానికి చెందిన మెటా నవీన్ అనే గిరిజన యువకుడు, మన్నె రామాంజనేయులు అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఎప్పుడూ జులాయిగా తిరిగే వీరిద్దరూ పలు నేరాలకు పాల్పడుతుండేవారు. పోలీసులు వీరిపై ఇప్పటి వరకు సుమారు 50 చోరీ కేసులు నమోదు చేశారు. ఇందులో నవీన్ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయితే మరో వ్యక్తి అంజి పోలీసులకు చిక్కడం లేదు. కాగా.. కొంత కాలం నుంచి వీరద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెద్దగా కలిసి ఉండటం లేదు. ఈ క్రమంలో నెల రోజుల కిందట అంజి నవీన్ కు కాల్ చేశాడు. ఒంగోలులోని కిమ్స్ మెడికల్ కాలేజ్ వెనక్కి రావాలని , మద్యం తాగుదామని చెప్పడం తో నవీన్ వచ్చాడు. కానీ అక్కడ అంజి ఒంటరిగా లేడు. చుట్టుపక్కలా ప్రాంతాలకు చెందిన మరో 9 మంది యువకులు అంజితో పాటు ఉన్నారు. ఈ క్రమంలో వీరంతా కలిసి మద్యాన్ని సేవించారు. మద్యం తాగుతున్న సమయంలోనే వీరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. అంజి గత వివాదాన్ని ముందుకు తేవడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కాగా.. అప్పటికే ప్లాన్ పై ప్రకారం అక్కడున్న యువకులంతా ఆ గిరిజనుడిపై దాడికి పాల్పడ్డారు. తనను విడిచి పెట్టాలని నవీన్ ఎంతగా ప్రాధేయపడ్డా.. వాళ్లు వినిపించుకోలేదు. క్రూరంగా రక్తం వచ్చేయాలని కొట్టారు. దాంతోనే దుండగులు ఆగలేదు. బాధితుడి నోట్లో మూత్ర విసర్జన చేశారు. దానిని తాగాలని ఒత్తిడి చేస్తూ, మళ్లీ కొట్టడం మొదలుపెట్టారు. ఆ మూత్రం పోసే వ్యక్తి మర్మాంగాన్ని బాధితుడి నోట్లో పెట్టుకోవాలని బలవంతం చేశారు. దీనిని అక్కడున్న పలువరు తమ ఫోన్ లోని కెమెరాలతో వీడియో తీశారు.

దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులపై వారు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే నిందితులు తాజాగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. పోలీసు ఉన్నతాధికారు వరకు వెళ్లడం తో..పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇటువంటి అమానుష చర్యలపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణచివేస్తున్నాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు బుల్టోజర్ సంస్కృతి తెచ్చింది. గిరిజనులపై అమానుష దాడులు చేస్తున్నవారి ఇళ్ళను, ఆస్తులను ధ్వంసం చేస్తోంది. మధ్యప్రదేశ్ లో ఇటీవల ఇటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్రం పోశాడు. ఈ ఘటనపై స్పందించి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నిందితుడి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేయించారు. అయితే ఇప్పుడు ఏపీలో అటువంటి ఘటనే వెలుగుచూడడంతో సీఎం జగన్ ఏం చేస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న.