ప్రారంభమైన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష

group 1 prelims exam start

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం 8.30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించారు. 10.15 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఉదయమే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చారు. మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికోసం 3.8 లక్ష లమంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్‌ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 1019 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

ఇక గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసే అభ్యర్థులకు మంత్రులు హరీష్ శంకర్ , ఎర్రబెల్లి అల్ ది బెస్ట్ తెలిపారు. అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిభ చాటాలన్నారు. ప్రిలిమ్స్‌కు హాజరవుతున్న అభ్యర్థులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు శుభాశీస్సులు తెలిపారు. ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలని, తల్లి దండ్రులు, గ్రామాలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.