ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం
ప్రభుత్వం ఆర్డినెన్స్ ఉత్తర్వులు
Amaravati: మూడవ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆర్డినెన్స్ జారీ చేశారు. 2021-22 తొలి మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలుపగా, ప్రభుత్వం ఆ మేరకు ఆర్డినెన్స్ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ మాసం వరకు సుమారు రూ.86 వేల కోట్ల నిధుల వ్యయానికి వెసులు బాటు కలిగింది. ఏపీలో గత మూడేళ్లుగా వివిధ కారణాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆర్డినెన్స్ ఉత్తర్వులు ఇస్తూ వచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/