తండ్రైన రైటర్ గోపీ మోహన్

వెంకీ, ఢీ, రెడీ, దూకుడు, లక్ష్యం, అల్లుడు శ్రీను, లౌక్యం వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసిన గోపీ మోహన్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి ప్రవీణ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డను తన చేతులతో ఎత్తుకుని దిగిన ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో సినీ ప్రముఖులు , అభిమానులు ఆయనకు విషెష్ అందజేస్తున్నారు. గోపీ మోహన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ కెరియర్ మొదలుపెట్టి యమజాతకుడు, వంశీ, నువ్వు నేను సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత 2002లో సంతోషం సినిమాతో స్క్రీన్ ప్లే రైటర్ గా మారారు.

ఈయన తన కెరీర్ లో ఎక్కువగా శ్రీను వైట్ల సినిమాలకు పని చేశారు. రెడీ, కింగ్, దూకుడు, షాడో, బ్రూస్ లీ వంటి సినిమాలకు స్టోరీ రైటర్ గా కూడా పని చేశారు. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ భాష చిత్రాల్లో కూడా స్టోరీ రైటర్ గా పని చేశారు. రెడీ హిందీ రీమేక్ వెర్షన్ కి స్టోరీ రైటర్ గా పని చేశారు. గత ఏడాది అక్టోబర్ లో శ్రీనువైట్ల గోపీచంద్ హీరోగా ఒక చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాకి గోపీ మోహన్ రైటర్ గా పనిచేస్తున్నారు.