ఎన్టీఆర్ ను లోకేష్ టీడీపీ లోకి ఆహ్వానించడం ఫై మంత్రి రోజా కామెంట్స్

యువగళం పాదయాత్ర లో నారా లోకేష్ మాట్లాడుతూ..జూ. ఎన్టీఆర్ టీడీపీ లోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పడం ఫై వైస్సార్సీపీ మంత్రి రోజా స్పందించారు. టీడీపీ పార్టీ చంద్రబాబుది కాదని , టీడీపీ ఎన్టీఆర్ పార్టీ అని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప ఆ పార్టీ బతకదని వాళ్లకు అర్థమైనట్టుందని అందుకే లోకేష్ ఆలా జూ. ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తున్నారని రోజా అన్నారు. లోకేశ్ పాదయాత్ర విఫలమైన నేపథ్యంలో, వారాహితో పవన్ కల్యాణ్ ఎక్కడ హీరో అయిపోతాడోనని భయపడుతున్నారని అన్నారు. అందుకే పవన్ కల్యాణ్ పై విషం చిమ్ముతున్నారని రోజా ఆరోపించారు. లోకేశ్ పాదయాత్రకు జనాలే లేరని, చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఇన్చార్జిలు కూడా లేరని ఎద్దేవా చేశారు. లోకేశ్ తన స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని, పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టుగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.

ఇలానే మాట్లాడితే లోకేష్ దెబ్బలు తింటాడు… లోకేష్ కూడా అదే కావాలని కోరుకుంట్లుందని విమర్శలు చేశారు. పెద్దిరెడ్డి కన్నెర్ర చేస్తే ఈ జిల్లాలో లోకేష్ తిరగగలడా..? చంద్రబాబు, లోకేష్ కు దమ్ముంటే చిత్తూరులో పోటి చేయండి…లోకేష్ ఒక పిల్లా పిత్రేగాడని చురకలు అంటించారు. మా నియోజక వర్గాల్లో వచ్చి మా తాటా తీస్తానంటూ.. అవినీతి చేశామంటూ పిచ్చోడు మాట్లాడినట్లు మాట్లాడుతూన్నాడు…దమ్ముంటే ఆధారాలతో రా అని లోకేష్ కు సవాల్‌ విసిరారు.