త్రివర్ణ పతాకం నుంచి మోడీ సర్కారు ఆకుపచ్చని రంగును తొలగిస్తుందా?: ఒవైసీ

ఆకుపచ్చని రంగుతో ప్రభుత్వానికి అన్ని సమస్యలు ఎందుకని?.. ఒవైసీ

will-modi-govt-remove-green-colour-from-tricolour-owaisi-in-parliament

న్యూఢిల్లీః హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నేడు లోక్ సభలో బిజెపి సర్కారుపై విరుచుకుపడ్డారు. త్రివర్ణ పతాకం నుంచి మోడీ సర్కారు ఆకుపచ్చని రంగును తొలగిస్తుందా? ఆకుపచ్చని రంగుతో ప్రభుత్వానికి అన్ని సమస్యలు ఎందుకని? ప్రధాని మోడీ చైనా దురాక్రమణలపై మాట్లాడతారా? బిల్కిస్ బానోకి న్యాయం దక్కుతుందా? అని ప్రశ్నించారు. ముస్లింలు ఆకుపచ్చని రంగును పవిత్రంగా భావిస్తారన్న విషయం తెలిసిందే.

మైనారిటీ పథకాలకు నిధుల కేటాయింపులను తగ్గించడాన్ని విమర్శించారు. ‘‘పస్మంద ముస్లింల పట్ల అంత ప్రేమ ఉంటే వారికి దళిత ముస్లింల హోదా ఇవ్వాలి’’ అని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. అలాగే, బీహార్ ముస్లింలకు ఓబీసీ హోదా కావాలన్నారు. హిండెన్ బర్గ్ భారత్ లో ఉండి ఉంటే చట్టవిరుద్ధ చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చేదని సెటైర్ వేశారు. ప్రధాని చైనా పట్ల భయం చెందకుండా, మైనారిటీలకు నిధులు పెంచాలని కోరారు. కేంద్ర బడ్జెట్ లో రక్షణ రంగానికి భారీ కేటాయింపుల నేపథ్యంలో ఒవైసీ ఇలా వ్యాఖ్యానించారు. అదానీ గ్రూప్ కంపెనీలకు వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ నివేదిక విడుదల చేయడం తెలిసిందే.