టీడీపీ కి రాజీనామా చేసిన గొల్లపల్లి సూర్యారావు

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీ కి రాజీనామా చేసారు. రాజోలు టికెట్ ను జనసేనకు కేటాయించడంతో అధిష్టానంపై అసంతృప్తి తో ఆయన పార్టీకి రాజీనామా చేసారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు కు తన రాజీనామా లేఖను పంపించారు.. ఆ లేఖలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొత్తం రాసుకొచ్చారు.

స్వర్గీయ ఎన్టీఆర్‌ మరియు వైఎస్‌ఆర్‌ మంత్రివర్గాల్లో సభ్యునిగా రాష్ట్ర ప్రజలకు సేవలందించాను.. 2014 నుంచి 2019 వరకు శాసన సభ్యునిగా మీకు గానీ, పార్టీకి గాని ఏవిధమైన ఇబ్బంది కలిగించకుండా టీడీపీ గౌరవాన్ని నిలిపిన విషయం మీకు తెలుసు.. 2019 నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్‌గా ప్రతికూల పరిస్థితిలో కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిబద్ధతో, క్రమశిక్షణతో అనుసరించి పార్టీ ప్రతిష్టను నిలబెట్టాను అంటూ లేఖ ద్వారా గుర్తు చేశారు.

గొల్లపల్లి త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు అమలాపురం లోక్‌సభ టికెట్ కేటాయిస్తారని తెలుస్తోంది. ఈ ఆఫర్‌తోనే ఆయన వైసీపీ కండువా కప్పుకునేందుకు అంగీకరించారని సమాచారం.