బండి సంజయ్ కాన్వాయ్‌పై గుడ్లతో దాడి

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బండి సంజయ్‌ వరంగల్ లో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన కాన్వాయ్‌పై గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడులకు పాల్పడిందని కాంగ్రెస్‌ కార్యకర్తలేనని బండి సంజయ్‌, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, గుడ్ల దాడి నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గుడ్లు విసిరిన వారి గుర్తించాలని డిమాండ్‌ చేశారు.