తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్ గంభీర్ దంపతులు
ప్రముఖ ఇండియన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ దంపతులు గురువారం ఉదయం కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో సతీసమేతంగా ఆయన పాల్గొన్నారు. గంభీర్కు ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడారు.
వచ్చే నెలలో క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది..ఈ టోర్నీ లో భారత్ ఘనవిజయం సాదించబోతుందని గంభీర్ ధీమా వ్యక్తం చేసారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో వరల్డ్ కప్ను భారత్ కచ్చితంగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు క్రికెట్ అభిమానులు గంభీర్తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.