కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి..మరికాసేపట్లో గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నాడు. ప్రస్తుతం శోభాయాత్ర కొనసాగుతుంది. శోభాయాత్ర లో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ప్రస్తుతం సెన్సేషన్ థియేటర్ వరకు చేరుకుంది. భక్తుల జయజయధ్వానాల మధ్య మహా గణేశుడు ముందుకు సాగుతున్నాడు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యలో హుస్సేన్సాగర్లో మహాగణపతి నిమజ్జనం పూర్తికానుంది.
బాలాపూర్ గణపతి గ్రామ ఊరేగింపు ప్రారంభమైంది. ఊరేగింపు అనంతరం ఉదయం 9.30 గంటలకు లడ్డూవేలం నిర్వహించనున్నారు. ఈ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది 36 మంది వేలంలో పాల్గొననున్నారు. వారిలో ముగ్గురు స్థానికులు ఉన్నారు. గతేడాది బాలాపూర్ గణేశుడి లడ్డు రూ.24.60 లక్షలు పలికింది. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు జరిగే బాలాపూర్- హుస్సేన్సాగర్ మార్గంలో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు.