2 వేల ఓట్ల తేడాతో గాలి జనార్దన్ రెడ్డి విజయం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్ధన్‌ రెడ్డి విజయం సాధించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నుంచి పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి రెండు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కర్ణాటక ఎన్నికల్లో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ స్థాపించి బరిలోకి దిగాడు గాలి జనార్దన్ రెడ్డి.

కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ పేరుతో ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ గంగావతిలో తప్ప ఎక్కడా ప్రభావాన్ని చూపించడం లేదు. గాలి జనార్థన్ రెడ్డితో పాటుగా 15 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేశారు.

బళ్లారి నుంచి ఆయన భార్య అరుణ బరిలో నిలిచారు. ఆయన భార్యతో పాటుగా మిగతా అభ్యర్థులందరూ వెనకంజలోనే ఉన్నారు. 15 స్థానాల్లో పోటీ చేసిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అన్ని స్థానాల్లోనూ బీజేపీ ఓట్లు చీల్చి కాంగ్రెస్ కు లాభం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.