సీఎం కేసీఆర్ ఫై గద్దర్ ఆగ్రహం

ప్రజా కవి గద్దర్..సీఎం కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. వికారాబాద్​ జిల్లా పరిగిలో కాంగ్రెస్​ సీనియర్​ నేత బట్టి విక్రమార్క చేసిన పాదయాత్రలో పాల్గొన్న గద్దర్..కేసీఆర్​కి అమర వీరుల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. గరీబ్ ప్రజల భూములను సీఎం కేసీఆర్ అన్యాయంగా లాక్కొని .. కోట్లకు పడగలు ఎత్తే కంపెనీలకు దానం చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణలో భూమి పోరాటం మొదలైందని.. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ధరణి పేరుతో పేద ప్రజల భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 25లక్షల భూమిని కేసీఆర్ తన దగ్గర పెట్టుకున్నారని ఆరోపించారు.