యూకే లో రేపటి నుంచి పూర్తి లాక్ డౌన్
ఫిబ్రవరి రెండో వారం వరకూ: ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం
కరోనా స్ట్రెయిన్ బ్రిటన్ ను గడగడలాడిస్తోంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది.
దీంతో మరోసారి దేశంలో పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు.
ఈ లాక్ డౌన్ రేపటి నుంచి అమలులోనికి రానుంది. ఈ లాక్ డౌన్ ఫిబ్రవరి రెండో వారం వరకూ అమలులో ఉంటుంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/