తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు
రాష్ట్రంలో మొత్తం కేసులు 2,87,993

Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.
తెలంగాణ వైద్య శాఖ తాజా బులిటెన్ మేరకు రాష్ట్రంలో గత 24 గంటల్లో అంటే మొన్నరాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 253 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో ముగ్గురు కరోనా కాటుకు బలయ్యారు.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,993కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,554కి పెరిగింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/