ఘట్‌కేసర్‌ బాలిక క్షేమం..

ఘట్‌కేసర్‌ లో కిడ్నాప్ కు గురైన బాలిక ను క్షేమంగా రక్షించారు పోలీసులు. ఘట్‌కేసర్‌లోని ఈడబ్ల్యూఎస్‌ కాలనీలో బుధువారం రాత్రి 08 గంటల సమయంలో కిరాణ షాప్ కు వెళ్లిన బాలిక కృష్ణవేణి.. ఆ తర్వాత ఎంతసేపటికి ఇంటికి రాకపోవడం తో..తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. ఎంతవెతికిన పాప ఆచూకీ లభించకపోవడం తో పోలీసులుకు పిర్యాదు చేసారు. పిర్యాదు స్వీకరించిన పోలీసులు రంగంలోకి దిగి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పాప ఆచూకీని కనుగొన్నారు.

పాపను ఎత్తుకెళ్లిన కిడ్నాపర్ సురేష్ ను గుర్తించిన రైల్వే పోలీసులు పాపను రక్షించి.. నిందితుడు సురేష్‌ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. రైల్వే స్టేషన్ నుంచి పాపను ఘట్కేసర్ తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ చౌహన్ ఘట్కేసర్ చేరుకున్నారు. పాప ఇంటికి వెళ్లి సీపీ చౌహన్ పాపను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.