గత ఎన్నికల కంటే ఈ సారి వైస్సార్సీపీ కి ఎక్కువ సీట్లు ఖాయం – మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు

గత ఎన్నికల కంటే ఈసారి వైస్సార్సీపీ ఎక్కువ సీట్లు సాదిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అని చెప్పుకొచ్చారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ను దివాలా తీయించిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. రూ. 20 వేల కోట్ల అప్పులు చేసింది, వాటిని పసుపు, కుంకుమకు మళ్లించారని… ఆ అప్పులన్నీ మేము తీర్చి, శాఖను మళ్లీ గాడిలో పెట్టామన్నారు.

ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని.. ధాన్యం తడిసినా, నూక వస్తున్నా రైతులకు మద్దతు ధర ఇచ్చామని తెలిపారు. కోటి 46 లక్షల మందికి మేము రేషన్ ఇస్తున్నామని… కేంద్రం కంటే అదనంగా 60 లక్షల కార్డులు ఇచ్చాం, వాటికి కేంద్రం సాయం చేయాలని కోరామని వివరించారు. నీతి ఆయోగ్ దీనికి అనుకూలంగా సిఫారసు చేసిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సింగిల్ గా ఎదుర్కొంటామని తెలిపారు. ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ అని.. అన్ని ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి విజయం సాధించామని వెల్లడించారు.