ప్రధాని మోడీని కలిసిన మాజీ ప్రధాని దేవెగౌడ
న్యూఢిల్లీః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని జేడీఎస్ అధినేత , మాజీ ప్రధాన మంత్రి హెచ్డీ దేవెగౌడ కలిశారు. ఇద్దరు కుమారులు కుమార స్వామి , రేవణ్ణ తో కలిసి ఢిల్లీలో మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీ విషయాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఈ మేరకు భేటీకి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రగతికి మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన కృషిని మోడీ కొనియాడారు. వారిని కలవడం ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుందంటూ పోస్ట్లో పేర్కొన్నారు. కాగా, ఇటీవలే ఎన్డీఏ కూటమితో జేడీఎస్ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.