జనసేన ఆవిర్భావ వేడుకలకు 12 కమిటీలు ఏర్పాటు
ఈ నెల 14న ఇప్పటంలో జనసేన ఆవిర్భావ వేడుక
అమరావతి : పవన్ కల్యాణ్ నేతృత్వంలోని ఈ నెల 14న జనసేన ఆవిర్భావ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పరిధిలోని మంగళగిరి మండలం ఇప్పటం గ్రామ పరిధిలో అట్టహాసంగా వేడుకలను నిర్వహించేందుకు జనసేన నిర్ణయించింది. అయితే పార్టీ ఆవిర్భావ వేడుకలతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి వేడుకలకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే.
సభా వేదికకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టిన జనసే.. వేడుకలను విజయవంతం చేసేందుకు ఏకంగా 12 కమిటీలను నియమించింది. ఈ కమిటీల్లో ఏపీతో పాటు తెలంగాణకు చెందిన నేతలకు కూడా చోటు కల్పించారు. తాజాగా మరో ఇద్దరు నేతలను ఈ కమిటీల్లో నియమిస్తున్నట్లుగా పవన్కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న హరిప్రసాద్ కాసేపటి క్రితం ప్రకటించారు. ఈ కొత్త నియామకాల్లో భాగంగా ప్రచార కమిటీలో వెంకట ప్రసాద్, వాలంటీర్స్ కమిటీలో రామకృష్ణకు చోటు కల్పిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/