తెలంగాణలో నేటి నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల ప్రారంభానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : కరోనా సెకండ్ వేవ్‎తో విజృంభించడంతో నగరంలోని సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో థియేటర్లలో ప్రదర్శన నిలిపివేసి రెండు నెలలకు పైన అవుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత నగరంలో తిరిగి థియేటర్లు ఈరోజు నుండి తెరుచుకుంటున్నాయి. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు క్రమంగా కరోనా నిబంధనలను సడలిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా దాదాపు అన్నింటినీ తెరుస్తోంది. ఇందులో భాగంగా సినిమా థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి అనుమతించింది. వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసేందుకు టీఎస్ ప్రభుత్వం అనుమతించింది. పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. దీంతో థియేటర్లను పునఃప్రారంభించడానికి యాజమాన్యాలు ముందుకొచ్చాయి.

ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని థియేటర్ల యాజమాన్యాలు తెలిపారు. చివరగా ‘వకీల్ సాబ్’ థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లు మూత పడ్డాయి. ఈరోజు సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’, తేజ సజ్జ నటించిన ‘ఇష్క్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/