నారా ఫ్యామిలీ కి వైఎస్ షర్మిల క్రిస్మస్‌ కానుక

నేడు క్రిస్మస్‌ సందర్బంగా వైస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల..నారా చంద్రబాబు ఫ్యామిలీ కి క్రిస్మస్‌ కానుకను పంపించింది. వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి లోకేష్ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ నోట్ పంపించారు. షర్మిల పంపిన క్రిస్మస్ కానుకను అందుకున్న లోకేష్ చాలా సంతోషించారు. తనకు క్రిస్మస్ కానుక పంపిన షర్మిలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. తన ఫ్యామిలీ తరఫున షర్మిలకు, ఆమె కుటుంబసభ్యులకు క్రిస్మస్ తో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు లోకేష్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడ్రోజుల ముందు నుంచే క్రిస్మస్ సందడి షురూ అయింది. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా కొందరు ప్రముఖులు తమ సన్నిహితులు, స్నేహితులకు క్రిస్మస్ కానుకలను పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు సీఎం జగన్‌ సోదరి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల క్రిస్మస్‌ కానుక పంపించారు.