టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ తేదీ ఖరారు

టీడీపీ, జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశం తేదీ ఖరారయింది. ఈ నెల 23వ తేదీన రాజమండ్రిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇరు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులను నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తొలిసారి రాజమండ్రిలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను చర్చించనున్నారు.

సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు లోకేశ్- పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అవతుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై చర్చిస్తుంది. ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించిన ఇరు పార్టీలు.. ఇక రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి.