నందమూరి హీరో సినిమాలో విజయశాంతి ..?

విజయశాంతి మరోసారి వెండితెర ఫై కనిపించబోతుంది. ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత విజయశాంతి వరుస సినిమాలతో బిజీ గా మారుతుందని అనుకున్నారు కానీ ఆమె మాత్రం సినిమాల జోలికి వెళ్ళలేదు. తాజాగా మరోసారి వెండితెరపై కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలను శుక్రవారం మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాములమ్మ కూడా హాజరైంది. ఈ పూజా కార్యక్రమాల వివరాలను తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన ఫొటోలలో ఆమె కూడా దర్శనమివ్వడంతో.. ఈ సినిమాలో రాములమ్మ ఓ కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్లుగానూ, ఆమె పాత్రకు ఈ సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి.

నందమూరి కల్యాణ్‌ రామ్ 21వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. కల్యాణ్ రామ్ సరసన సయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించనుంది.