మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామూన 2.15 గంటల సమయంలో ఛత్రపతి శంభాజీనగర్‌లోని వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉ‍న్న చేతి గ్లౌజ్‌ల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చెలరేగిన భారీగా మంటలకు ఆరుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 15 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.

కర్మాగారం నుండి నుండి భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు కార్మికులు అర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్మికులు నిద్రలో ఉండగా అగ్ని ప్రమాదం జరగడంతో మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు.