వరంగల్ MGMలో కరోనా కలకలం.. ఆరుగురు చిన్నారులకు కరోనా

కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తుంది. ఈసారి చిన్న పిల్లలకు , 65 ఏళ్ల పైబడిన వారికీ ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు చిన్నారులు కరోనా తో బాధపడుతుండగా..తాజాగా హైదరాబాద్ ఉస్మానియా హాస్పటల్ లో ఇద్దరు కరోనా తో చనిపోయారు.

తాజాగా వరంగల్ MGM హాస్పటల్ లో ఆరుగురు చిన్నారులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎంజీఎం వైద్యులు.. పిల్లల వార్డులో 20 పడకలతో కొవిడ్ ప్రత్యేక వార్డ్‌ను ఏర్పాటు చేశారు. కరోనా నిర్ధారణ అయిన చిన్నారులకు ఆ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా, ఒకేసారి ఆరుగురు చిన్నారులకు కరోనా పాజిటివ్ రావడంతో పేషెంట్లు భయాందోళనకు గురి అవుతున్నారు.