బోయిన్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్‌ పరిధిలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నల్లగుట్ట లోని డెక్కన్ షో రూమ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి , ముగ్గుర్ని బలి తీసుకుంది. ఆ తర్వాత నాంపల్లిలోని నుమాయిష్ ఎగ్జిబిషన్ పార్కింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవిచింది. అలాగే హకీంపేటలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతుండడం తో అంత వణికిపోతున్నారు.

తాజాగా ఈరోజు సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది గంటసేపు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాణ నష్టం జరగకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆస్తి నష్టం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుసుకుంటున్నారు. ఎండాకాలం పూర్తిగా రాకమునుపై గోదాముల్లో, షాపుల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతన్నారు.