పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వ్యాన్ ని గుద్దడంతో కారు డ్రైవర్ సూర్య భగవాన్ మృతి(28) అక్కడికక్కడే మృతి చెందాడు. సబ్బవరం నుంచి పెందుర్తి వైపు వెళ్తున్న కారు ఐసర్ వ్యాన్‌ను ఢీకొట్టింది.

దీంతో కారులో ఉన్న ఒకరు మృతి చెందగా.. మిగతా నలుగురులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు చెబుతున్నారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.