మంచిర్యాల ప్రభుత్వ హాస్పటల్ లో దారుణం..

ప్రభుత్వ హాస్పటల్స్ లలో డాక్టర్ల నిర్లక్ష్యాలు ఆగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట డాక్టర్స్ నిర్లక్ష్యం కారణంగా బాధితులు బాధపడుతూనే ఉన్నారు. తాజాగా మంచిర్యాల ప్రభుత్వ హాస్పటల్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గర్భిణికి ప్రసవం చేసి కడుపులోనే డాక్టర్స్ క్లాత్ ను మర్చిపోయారు. వేమనపల్లి మండలం నిల్వాయికి చెందిన లయా అనే గర్భిణీకి జిల్లా ఆస్పత్రిలో డెలివరీ చేశారు డాక్టర్స్ .

డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గర్భిణీ మూత్ర విసర్జన నిలిచిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో రాత్రి చెన్నూర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం డాక్టర్స్ అక్కడ క్లాత్ తొలగించారు. మళ్ళీ మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్స్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.