సంతోషం వ్యక్తం చేసిన అచ్చెన్నాయడు

అచ్చెన్నకు రాష్ట్ర బాధ్యతలు

atchannaidu

అమరావతి: ఏపి అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించాన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర టిడిపి బాధ్యతలు తనకు అప్పగించడం పట్ల అచ్చెన్నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలతో ఏపి టిడిపి అధ్యక్షుడిగా నియమితుడ్నయ్యానని అచ్చెన్న ట్విట్టర్ లో వెల్లడించారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తనకు ఈ అవకాశం కల్పించారని వివరించారు. మీ ఆశీస్సులు, మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడ్ని ప్రార్థిస్తున్నా.. మీ కింజరాపు అచ్చెన్నాయుడు అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/