ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. చెన్నై నుంచి ఒంగోలు వెళ్తుండగా రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఒంగోలుకి చెందిన పవన్, పరమేశ్, శ్రీనుగా పోలీసులు గుర్తించారు.