అవినీతి చేసి డబ్బు సంపాదిస్తున్నారు అంటూ ఏపీ మంత్రులపై హీరో సిద్దార్థ్ ఆగ్రహం..

ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్స్ వ్యవహారం హాట్ హాట్ గా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా..జగన్ సర్కార్ మాత్రం అవన్నీ పక్కకు పెట్టి ప్రేక్షకులకు వినోదాన్ని అందించే చిత్రసీమపై పగ పట్టారు. సినిమా టికెట్స్ ధరలు పెంచకపోగా..ఉన్న ధరలను అమాంతం తగ్గించారు. ప్రస్తుతం టి కప్పు కూడా రాని ధరకు సినిమా టికెట్ ధరను ఫిక్స్ చేసి థియేటర్స్ యజమాన్యులతో పాటు నిర్మాతలను నష్టపరుస్తున్నారు. ఇదే కాదు నిబంధనలు పాటించడం లేదంటూ గత మూడు రోజులుగా సినిమా హాల్స్ ఫై తనిఖీలు చేస్తూ సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ సర్కార్ తీరు ఫై హీరో నాని ఆగ్రహం వ్యక్తం చేసారు. కిరాణా షాప్ కలెక్షన్ల కంటే థియేటర్ల కలెక్షన్లు తక్కువ అయిపోయాయి అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో నాని వ్యాఖ్యల ఫై ఏపీ మాత్రం కౌంటర్లు వేస్తూ వస్తున్నారు.

తాజాగా మరో హీరో బొమ్మరిల్లు ఫేమ్ సిద్దార్థ్ ఏపీ మంత్రులపై విరుచుకపడ్డారు. “సినిమా పరిశ్రమలో పనిచేసే వాళ్లంతా… ప్రభుత్వానికి లెక్కలతో సహా టాక్ లు కడుతున్నాం. రాజకీయ నాయకులు మాత్రం ఎలాంటి టాక్స్ లు లేకుండా విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. ప్రజల డబ్బును అన్యాయంగా దోచుకుంటున్నారు. అవినీతి చేసి సంపాదించుకుంటున్నారు. కానీ మేము అలా కాదు. మీ విలాసాలను తగ్గించుకోనీ.. మాకు సబ్సిడీలు ఇవ్వండి” అంటూ ట్విట్ట్ర్ ద్వారా మంత్రులకు కౌంటర్ ఇచ్చారు.