విజయనగరం జిల్లాలో విషాదం..

విజయనగరం జిల్లా శృంగవరపుకోట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నూతిలో పడి కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు కుమార్తె మృతిచెందారు. ఎండీ మొహినుద్దీన్‌ తన కుటుంబంతో కలిసి విశాఖలోని మర్రిపాలెం పరిధిలోని ఎఫ్‌సీఐ నగర్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం భార్య సంషినిషా, కుమార్తె ఫాతిమా జహీదా, కుమారుడు అలీతో కలిసి కొత్తవలస సమీపంలోని చింతపాలెంలో తమ స్థలం చూసేందుకు వెళ్లారు.

మోహినుద్దీన్ తన స్థలంలో ఉన్న బావిలో దూకారు. ఈ ఘటనలో మొహినుద్దీన్‌, అతడి భార్య సంషినిషా, కుమార్తె జహీదా చనిపోగా.. కుమారుడు అలీ ప్రాణాలతో బయటపడ్డాడు. కుటుంబం బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటనే విషయంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ సమస్యలతో ప్రాణాలు తీసుకున్నారా.. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా కారణమా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఆరా తీస్తున్నారు.