ఎంపీ బరిలో ఈటెల..

తెలంగాణ లో మరోసారి ఎన్నికల హడావిడి మొదలుకాబోతుంది. నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా..ఇప్పుడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎంపీ బరిలో నిల్చువాలనుకునే వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించడం తో పెద్ద ఎత్తున నేతలు దరఖాస్తులు చేసుకున్నారు.

ఇటు బిజెపి సైతం అభ్యర్థుల ఎంపిక లో బిజీ అయ్యాయి. కాగా అసెంబ్లీ బరిలో హుజురాబాద్ , గజ్వెల్ స్థానాల నుండి పోటీ చేసి ఓటమి చెందిన ఈటెల..ఈసారి పార్లమెంట్ బరిలో నిల్చుబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపైనా ఆయన స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు సాధ్యపడదని తేల్చిచెప్పారు. మరి ఈటెల ఎక్కడినుండి పోటీ చేస్తారనేది చూడాలి.