యూకే ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ యూకే ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్‌ యూకే పర్యటనకు వెళ్లారు. బుధువారం ఉదయం లండన్ బయల్దేరిన కేటీఆర్.. 13వ తేదీ వరకు తన పర్యటన కొనసాగించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా యూకేలోని పారిశ్రామిక దిగ్గజ సంస్థలతో పాటు.. వ్యాపార, వాణిజ్య సంఘాలతో సమావేశం కానున్నారు.

గ‌తేడాది మే 18 నుంచి 22 వరకు కేటీఆర్ లండన్‌లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. లండన్‌లో భారత హైకమిషన్‌ సమావేశంతోపాటు ప్రవాస భారతీయులు, యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు ప్రతిష్ఠాత్మక సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.